Friday, May 3, 2024

భారత్@4.08 లక్షల కరోనా కేసులు…

- Advertisement -
- Advertisement -

4.08 Lakh corona positive cases in India

ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనా వైరస్ ధాటికి భారత్ విలవిలలాడిపోతుంది. గత 24 గంటల్లో 4.08 లక్షల కరోనా కేసులు నమోదుకాగా 3464 మంది మృత్యువాతపడ్డారు. కరోనా కేసుల సంఖ్య 1.91 కోట్లకు చేరుకోగా 2.11 లక్షల మంది చనిపోయారు. కరోనా నుంచి 1.56 కోట్ల మంది కోలుకోగా 32.63 లక్షల మంది చికిత్స తీసుకుంటున్నారు. మహారాష్ట్రలో కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. మహారాష్ట్రలో 63 వేల కేసులు నమోదు కాగా 828 మంది చనిపోయారు. వరసగా కర్నాటక(48,296), కేరళ(37,199), ఉత్తర ప్రదేశ్(34,372), ఢిల్లీ (27,047)లలో కరోనా కేసులు నమోదయ్యాయి. 28.6 కోట్ల మందికి కరోనా టెస్టులు చేశామని ఐసిఎంఆర్ ప్రకటించింది. 15.2 కోట్ల మంది వ్యాక్సిన్ ఇచ్చినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News