Saturday, April 27, 2024

హిమాయత్ నగర్‌ ఎటిఎం చోరీ కేసులో నలుగురు అరెస్టు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎటిఎం చోరీ కేసులో పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ఈ నెల(జూలై) 4వ తేదీన హిమాయత్ నగర్‌లో ఎటిఎంలో డబ్బుల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఎటిఎం సెంటర్‌లోకి నలుగురు దుండగులు చొరబడి.. ఎటిఎం డబ్బులు డిపాజిట్‌ చేస్తున్న సిబ్బందిపై పెప్పర్ స్ప్రే కొట్టి చోరీకి పాల్పడ్డారు.

ఈ ఘటనపై నారాయణగూడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం రంగంలోకి దిగిన పోలీసులు నలుగురు దొంగలను కేరళలో అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News