Monday, April 29, 2024

హీరోయిన్ పూర్ణకు బెదిరింపులు.. నలుగురు అరెస్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హీరోయిన్ పూర్ణకు బెదిరింపులు కలకలం రేపాయి. తనను నలుగురు యువకులు బ్లాక్ మెయిల్ చేస్తూ వేధిస్తున్నారంటూ హీరోయిన్ పూర్ణ అలియాస్ శ్యామ్నా కాసిమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ అన్నీ బంద్ కావడంతో పూర్ణ తన సొంతూరు కేరళకు వెళ్లారు. ఈ క్రమంలో కొన్ని మలయాళ చిత్రాలకు కూడా పూర్ణ సంతకం చేసినట్లు తెలుస్తోంది. దీంతోపాటు తనకు వచ్చిన ఓ పెళ్లి సంబంధం గురించి కుటుంబ సభ్యులు మాట్లాడుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు తమకు డబ్బులు ఇవ్వాలంటూ బ్లాక్ మెయిల్ చేస్తూ బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో పూర్ణ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోనికి దిగిన కేరళ పోలీసులు నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. అనంతరం నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. రవిబాబు తెరకెక్కించిన  ‘అవును’ అనే హర్రర్ సినిమాలో హీరోయిన్‌గా, ‘డీ జోడీ’ షోలో జడ్జెస్‌లో ఒకరిగా పూర్ణ గుర్తింపు పొందారు.

4 persons Arrested for Threatening to heroine Poorna

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News