Friday, April 26, 2024

దేశంలో మరో 41,810 మందికి కరోనా

- Advertisement -
- Advertisement -

41810 new COVID 19 infections in India

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24గంటల్లో 41,810 కొత్త కోవిడ్-19 కేసులు, 496 మంది మరణించారు. అదే సమయంలో 42,298 మంది కోలుకున్నారు. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 93,92,920కి చేరింది. ఇండియాలో ఇప్పటివరకు 1,36,696 మంది బాధితులు కరోనాతో మృతి చెందారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 4,53,956 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. భారత్ లో కరోనా మహమ్మారి నుంచి 88,02,267 మంది బాధితులు కోలుకుని ఇళ్లకు చేరుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. నిన్న పరీక్షించిన 12,83,449 నమూనాలతో సహా నవంబర్ 28 వరకు పరీక్షించిన మొత్తం నమూనాల సంఖ్య 13,95,03,803కు చేరిందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) ప్రకటించింది.

41810 new COVID 19 infections in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News