- Advertisement -
అమరావతి: ఎపిలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 8,388 శాంపిళ్లను పరీక్షించగా 43 మందికి కొవిడ్-19 పాజిటివ్ వచ్చినట్టు ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఎపిలో మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య 1,930 చేరగా… 44మంది కోవిడ్ తో ప్రాణాలు కోల్పోయారు. ఎపిలో ప్రస్తుతం 999 యాక్టివ్ కేసులున్నాయి. 887 మంది కరోనాతో కోలుకున్నారు. కృష్ణ జిల్లాలో కొత్తగా 16 కేసులు, చిత్తూరులో -11 విశాఖలో -5, కర్నూలులో -6, అనంతపురం -3 గుంటూరు -2 కేసులు నమోదయినట్టు ఆరోగ్యశాఖ తెలిపింది.
43 new corona cases reported in Andhra Pradesh
- Advertisement -