Thursday, May 9, 2024

ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమ వద్ద ఉద్రిక్తత

- Advertisement -
- Advertisement -

ap dgp

అమరావతి: విశాఖ ఎల్‌జీ పాలిమర్స్‌ వద్ద స్థానికులు ఆందోళనకు దిగారు. ఆర్‌ఆర్‌ వెంకటాపురం గ్రామస్తులు పరిశ్రమ గేటు ముందు మృతదేహాలతో బైఠాయించారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. స్థానికులు గేటును తోసుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు.

కొందరు ఎల్జీపాలిమర్ గేటులోపలకి దూసుకెళ్లారు. వారిని లోనికి రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. డిజిపి గౌతం సవాంగ్ పరిశ్రమ వద్దకు చేరుకుని గ్యాస్‌ లీకైన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన బయటకు వస్తున్న సమయంలో  ప్రజలు గేటు ముందు బైఠాయించడంతో డిజిపి సవాంగ్ లోపలే ఉండిపోయారు. యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనకారులు కాస్త సంయమనం పాటించాలని పోలీసులు కోరుతన్నారు.

High Tension At Visakha LG Polymers

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News