Monday, May 13, 2024

ఎపిలో కొత్తగా 438 కరోనా కేసులు..

- Advertisement -
- Advertisement -

Another 2,154 Corona positive cases

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కొద్దిరోజులుగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఎపిలో గడిచిన 24గంటల్లో 64,236 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 438 పాజిటీవ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనాతో మరో 2మంది మృతి చెందినట్లు తెలిపింది. దీంతో ఎపిలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 8 లక్షల 78 వేలకు పైగా నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో 7,076 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,355 యాక్టివ్ కేసులున్నాయి. ఇక, కరోనా నుంచి ఇప్పటివరకు 8,67,445 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఎపిలో ఇప్పటివరకు మొత్తం కరోనా టెస్టులు కోటి 12వేల మందికి పైగా కరోనా పరీక్షలు చేసినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.

438 New Corona Cases Registered in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News