రంగారెడ్డి: ప్రేమించిన యువతి మోసం చేసిందంటూ ఓ యువకుడు ఆత్మహత్యయత్నానికి పాల్పడిన సంఘటన రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మున్సిపాలిటి పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… శాంతినగర్ కాలనీకి చెందిన సామల రవి, సువర్ణ దంపతుల కుమారుడు సాయి ప్రసాద్ (25) తమ బందువుల అమ్మాయి తొమ్మిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల ఆ యువతికి మరో యువకుడితో తల్లితండ్రులు పెళ్లి నిర్ణయించారు. అంతే కాదు ఈ నెల 31 తేదీన ముహూర్తం కూడ ఖరారు చేశారు. విషయం తెలిసిన సాయి ప్రసాద్ తీవ్ర మనస్థాపానికి గురై శనివారం సాయంత్రం తన ఇంట్లో నిద్రమాత్రలు మింగి, చేయి కోసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు విషయం గ్రహించి హూటాహూటిన ఆసుపత్రికి తరలించారు. అంతకు ముందు సాయి ప్రసాద్ సెల్పీ వీడియోలో తన చావుకు ఎవరూ కారణం కాదని… ప్రేమించిన యువతి మోసం చేయడంతోనే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం సాయి ప్రసాద్ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Boyfriend attempted suicide after girlfriend cheats