Monday, April 29, 2024

తెలుగు రాష్ట్రాలలో కొనసాగుతున్న కొవిడ్ ఉధృతి

- Advertisement -
- Advertisement -
4393 new covid cases in telangana
ఏపీలో 12,926, తెలంగాణలో 4,393 కొత్త కేసులు

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలలో కొవిడ్ ఉధృతి కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో రోజువారీ కరోనా కేసులు నమోదు తగ్గడం లేదు. ఏపీలో 12,296 కొత్త కేసులు నమోదు కాగా, తెలంగాణలో 4,393 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,16,224 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 4,207 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,31,212కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. మొత్తం కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 1,643 కేసులు నమోదయ్యాయి.మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 421, రంగారెడ్డి జిల్లాలో 286 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 4,071కు చేరింది. తాజాగా కరోనా నుంచి 2,319 మంది కోలుకోగా, ఇప్పటివరకు 6,95,942 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు 95.18 శాతం నమోదు కాగా, మరణాల రేటు 0.56 శాతంగా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 31,199 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరో 9,537 మంది ఫలితాలు రావాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News