Monday, April 29, 2024

దేశంలో కొత్తగా 45వేల కరోనా కేసులు..

- Advertisement -
- Advertisement -

45352 New Corona Cases Reported in India

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 45,352 కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. కరోనాతో మరో 366 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 3,29,03,289కు చేరింది. వైరస్ బారిన పడి ఇప్పటివరకు దేశంలో 4,39,895మంది మృతిచెందారు.  గత 24 గంటల్లో కొత్తగా 34,791మంది బాధితులు కోలుకోగా.. ఇప్పటివరకు 3,20,63,616 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 3,99,778 యాక్టీవ్ ఉన్నాయి. రికవరీ రేటు 97.45 శాతానికి పెరిగిందని ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు దేశంలో 67,09,59,968 కోవిడ్ వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేసినట్లు పేర్కొంది.

45352 New Corona Cases Reported in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News