Sunday, May 12, 2024

ఎపిలో కొత్తగా 4,622 కరోనా కేసులు..

- Advertisement -
- Advertisement -

4622 New Corona Cases Registered in AP

అమరావతి: గత కొన్ని వారాలుగా ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. గ‌డిచిన 24 గంట‌ల్లో 72,082మందికి పరీక్షలు చేయగా.. కొత్తగా 4,622 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. కరోనాతో మరో 35మంది బాధితులు మృతి చెందినట్లు తెలిపింది. దీంతో ఎపిలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 7,63,573కు చేరుకుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బారిన పడి 6,291మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 42,855మంది కరోనా బాధితులు రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో గత 24 గంటల్లో 5,715మంది డిశ్చార్జ్ అయ్యారు.

4622 New Corona Cases Registered in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News