న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభణ వేగంగా కొనసాగుతోంది. భారత్ లో ఇప్పటికే కోవిడ్ 19 కేసులు లక్ష దాటాయి. గడిచిన 24గంటల్లో 4,970 కొత్త కేసులు, 134 మరణాలు నమోదయ్యాయని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో ఇండియాలో మొత్తం పాజిటివ్ కేసులు 10,1139 చేరగా.. మరణాల సంఖ్య 3,163 కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో 58వేల 802 కరోనా యాక్టివ్ కేసులున్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులిటెన్ లో పేర్కొంది.
ఇప్పటివరకు కరోనా మహమ్మారితో కోలుకుని 39,173మంది డిశ్చార్జ్ అయ్యారు. అటు మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 35,058 చేరింది. 1,249మంది కోవిడ్ తో ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులో 11,760 పాజిటివ్ కేసులు, 81 మరణాలు నమోదయ్యాయి. గుజరాత్ లో 11,745 కోవిడ్ బారిన పడగా, 694మంది చనిపోయారు. దేశరాజధాని ఢిల్లీలో కరోనా కేసులు 10వేలు దాటాయి. ప్రస్తుతం ఢిల్లీలో కరోనా కేసులు 1,00,54 నమోదు కాగా, 168మంది ఈ వైరస్ తో మృత్యువాత పడ్డారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా రాకాసి విలయతాండవం చేస్తోంది.
4970 New Covid 19 Cases And 134 Deaths in India