- Advertisement -
ఆగ్రాః ఉత్తర్ ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు ట్రక్కును ఢీకొట్టడంతో మంటలు చెలరేగి కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు సజీవదహనమైన ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గురువారం తెల్లవారుజామున సీనియర్ జర్నలిస్టు మురళి మనోహర్ సరోజ్ తన కుటుంబంతో కలిసి లక్నో నుంచి కారులో ఢిల్లీకి బయల్దేరాడు. అయితే, తెల్లవారుజామున 4.15గంటల సమయంలో ఆగ్రాలోని ఖండోలి టోల్ ప్లాజా వద్ద యమున ఎక్స్ప్రెస్ రహదారిపై యు టర్న్ తీసుకుంటున్న ఓ ట్రక్కును వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ట్రక్కు డీజిల్ ట్యాంక్ పగలడంతో.. కారు బ్యానెట్పై డీజిల్ పడి మంటలు చెలరేగాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు మంటల్లో చిక్కుకొని సజీవదహనం అయ్యారు.
5 burnt to death after car collision with truck in Agra
- Advertisement -