Monday, April 29, 2024

బాలీవుడ్ ఎంట్రీ

- Advertisement -
- Advertisement -

Rashmika mandanna Bollywood entry

 

ఇప్పుడు మన టాలీవుడ్‌లో మోస్ట్ లక్కీ హీరోయిన్ ఎవరన్నా ఉన్నారంటే అది రష్మికా మందన్న అనే చెప్పాలి. చిన్న సినిమాల నుంచి స్టార్ హీరోలతో సినిమాలు చేసి భారీ విజయాలను సొంతం చేసుకొని మరిన్ని ఆసక్తికర ప్రాజెక్టులతో బిజీగా మారిపోయింది ఈ యంగ్ హీరోయిన్. ఈ స్టార్ హీరోయిన్ ఇప్పుడు బాలీవుడ్‌లో అడుగు పెట్టడానికి సిద్ధమైంది. భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘మిషన్ మజ్ను’ చిత్రంలో ఆమె హీరోయిన్‌గా నటించనుంది. యంగ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రాకు జోడీగా ఆమె కనిపించనుంది. అయితే ఈ చిత్రం నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కనుంది. పాకిస్తాన్‌లో ఇండియన్ ఇంటెలిజెన్స్ వారు జరిపే ఒక సీక్రెట్ మిషన్ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు తెలిసింది. ఈ చిత్రానికి శంతను బాగ్చి దర్శకత్వం వహిస్తున్నాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News