- Advertisement -
ఇప్పుడు మన టాలీవుడ్లో మోస్ట్ లక్కీ హీరోయిన్ ఎవరన్నా ఉన్నారంటే అది రష్మికా మందన్న అనే చెప్పాలి. చిన్న సినిమాల నుంచి స్టార్ హీరోలతో సినిమాలు చేసి భారీ విజయాలను సొంతం చేసుకొని మరిన్ని ఆసక్తికర ప్రాజెక్టులతో బిజీగా మారిపోయింది ఈ యంగ్ హీరోయిన్. ఈ స్టార్ హీరోయిన్ ఇప్పుడు బాలీవుడ్లో అడుగు పెట్టడానికి సిద్ధమైంది. భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘మిషన్ మజ్ను’ చిత్రంలో ఆమె హీరోయిన్గా నటించనుంది. యంగ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రాకు జోడీగా ఆమె కనిపించనుంది. అయితే ఈ చిత్రం నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కనుంది. పాకిస్తాన్లో ఇండియన్ ఇంటెలిజెన్స్ వారు జరిపే ఒక సీక్రెట్ మిషన్ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు తెలిసింది. ఈ చిత్రానికి శంతను బాగ్చి దర్శకత్వం వహిస్తున్నాడు.
- Advertisement -