Tuesday, April 30, 2024

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

5 Killed in Road Accident in Prakasam

అమరావతి: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో బోల్తా పడి ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటన జిల్లాలోని తుర్లపాడు మండలం రోలుగుంపాడు ఎస్టీ కాలనీ వద్ద ఒంగోలు-కర్నూలు రహదారిపై చోటుచేసుకుంది. రహదారి దాటుతున్న ఓ గేదెను టిప్పర్ ఢీకొట్టడంతో రోడ్డుపైనే పడి మృతిచెందింది. ఈ సమయంలో వేగంగా వచ్చిన ఓ ఆటో గేదె కళేబరాన్ని గమనించకుండా దాని పైకి ఎక్కి కంట్రోల్ తప్పింది. ఇదే సమయంలో ఎదురుగా వచ్చిన టిప్పర్ ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృతులను శారమ్మ, మార్తమ్మ, లింగమ్మ, వెంకటేశ్‌రెడ్డిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టనున్నట్లు తెలిపారు.

5 Killed in Road Accident in Prakasam

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News