Sunday, May 12, 2024

ఘోరం.. ఒకే కుటుంబంలో ఐదుగురి దారుణ హత్య..

- Advertisement -
- Advertisement -

Rowdy Sheeter Brutally Murdered in saroornagar

చండీగఢ్: పంజాబ్‌లోని తరన్‌తరన్ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురిని దారుణంగా హత్య చేశారు. పట్టి పోలీసు స్టేషన్ పరిధిలోని కైరాన్ గ్రామంలో గురువారం ఈ దారుణం చోటు చేసుకుంది. బ్రిజ్‌లాల్ ధతు కుటుంబం చాలా కాలంగా అక్రమ మద్యం వ్యాపారం, డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయి. ఆయన భార్య డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో పదేళ్ల జైలుశిక్ష అనుభవిస్తూ 20 రోజుల క్రితం జైలులో చనిపోయింది. కుటుంబంలోని మిగతా అయిదుగురు సభ్యులను బుధవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. మృతుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. గురువారం ఉదయం ఈ హత్యల వార్త దావానంలా గ్రామంలో వ్యాప్తి చెందడంతో గ్రామంలో భయం నెలకొంది. బిఎస్‌పి కుల్జిందర్ సింగ్ నేతృత్వంలో పోలీసు ఉన్నతాధికారులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

5 Persons of Same Family Murdered in Punjab

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News