Tuesday, May 7, 2024

కర్నాటకలో కరోనా మరణ మృదంగం… 529 మంది మృతి

- Advertisement -
- Advertisement -

529 Members dead with corona virus in Karnataka

బెంగళూరు: కర్నాటక రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనా వైరస్ విలయతాండవం చేస్తుండడంతో ప్రధాని ఆస్పత్రులు శవాల దిబ్బలుగా మారాయి. గత 24 గంటల్లో 25,311 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 529 మంది మృత్యువాతపడ్డారు. కర్నాటకలో కరోనా కేసుల సంఖ్య 24.5 లక్షలకు చేరుకోగా 25,811 మంది మృతి చెందారు. కరోనా వ్యాధి నుంచి 19.83 లక్షల మంది కోలుకోగా 4.4 లక్షల మంది చికిత్స పొందుతున్నారు. కర్నాటకలో కరోనా టెస్టుల సంఖ్య 2.88 కోట్లకు చేరుకోగా గత 24 గంటల్లో 1.08 లక్షల మందికి టెస్టులు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News