Wednesday, May 1, 2024

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డుప్రమాదం

- Advertisement -
- Advertisement -

6 killed in accident at Kannauj Uttar Pradesh

లక్నో: కారు, ట్రక్కు ఢీకొని జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో ఆరుగురు మృతిచెందిన సంఘటన ఉత్తరప్రదేశ్‌లో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. కన్నౌజ్‌ సమీపంలోని తాల్‌గ్రామ్‌ వద్ద ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌ వేపై ట్రక్కును వేగంగా వచ్చి అదుపుతప్పిన ఓ కారు వెనుక నుంచి వచ్చి బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదధాటికి కారు నుజ్జునుజ్జయింది. స్థానికుల సమాచారంతో ఘటాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. పొగమంచు కారణంగానే ఆగిఉన్న ట్రక్కును కారు ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు.

6 killed in accident at Kannauj Uttar Pradesh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News