న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో 6,088 కోవిడ్-19 పాజిటివ్ కేసులు, 148 మరణాలు నమోదయ్యాయని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,18,447కు చేరింది. వీటిలో 66,330 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు దేశంలో 3,583 మంది బాధితులు కరోనాతో మృతి చెందారు. మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 41,642 పెరిగింది. ఇప్పటివరకు ఈ మహమ్మారితో 1,454 మంది మృత్యువాత పడ్డారు.
రాష్ట్రవ్యాప్తంగా 28,462 యాక్టివ్ కేసులున్నాయి. 11,726 మంది కోవిడ్ తో కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. భారత్లోని మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, ఢిల్లీలలో కరోనా కేసులు వేగంగా విస్తరిస్తున్నాయి. అటు ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 24గంటల్లో లక్ష కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ప్రపంచంలో కరోనా కేసులు సంఖ్య 51.32 లక్షలకుపైగా దాటింది. అమెరికా, రష్యాల్లో ప్రతి రోజూ వేల సంఖ్య లో కేసులు నమోదవుతున్నాయి. అమెరికాలో 16లక్షల మందికి కరోనా సోకింది.
6088 New Covid 19 cases and 148 deaths in India