Saturday, April 27, 2024

రాష్ట్రంలో కొత్తగా 623 కోవిడ్ కేసులు

- Advertisement -
- Advertisement -

623 New Covid-19 Cases Reported in Telangana

హైదరాబాద్: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,11,947 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 623 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 6,43,716కి చేరింది. మరో ముగ్గురు వైరస్ బారినపడి మరణించినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. దీంతో మొత్తం మరణాల సంఖ్య 3,796గా నమోదైంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 2 కోట్ల 17 లక్షల 81వేల 952 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. మహమ్మారి నుంచి కొత్తగా 746 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు 6,30,732 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 9,188 క్రియాశీల కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 97.98 శాతంగా నమోదైంది.

623 New Covid-19 Cases Reported in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News