- Advertisement -
న్యూఢిల్లీ : కరోనా వైరస్తో అల్లాడుతున్న చైనా నుంచి 640 మంది భారతీయులను తరలించినట్టు ఇదంతా బీజింగ్ సహకారంతో ఉమ్మడి ఆపరేషన్ ద్వారా జరిగిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఇఎ) గురువారం వెల్లడించింది. ఆ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ ఇప్పటి వరకు తరలించిన వారే కాకుండా మరో పది మంది చైనాలో స్క్రీనింగ్లో ఉన్నారని, వారు తిరిగి స్వదేశానికి రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. కరోనా వైరస్ కారణం గానే మామూలు వీసాలు, చైనా నుంచి ప్రస్తుత ఇ వీసాలు పనిచేయబోవని ఆయన వివరించారు.
640 Indians evacuated from China
- Advertisement -