Thursday, May 9, 2024

ఎపిలో కొత్తగా 7,224 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

7224 New Covid-19 Cases Reported in AP

అమరావతి: ఎపిలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 35,907 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 7,224 మందికి కరోనా సోకింది. 15 మంది ఈ మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో మరో 2,332 మంది బాధితులు కోలుకున్నారు. ఎపిలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,52,560కి చేరాయి. ఆంధ్రలో ప్రస్తుతం 40,469 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. చిత్తూరులో 4, నెల్లూరు 3, కర్నూలు, విశాఖలో ఇద్దరు చొప్పున మృతి చెందారు. ఎపిలో మొత్తం కరోనా మరణాలు 7,388కి చేరాయి. ఇప్పటివరకు 9,04,703 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తాజాగా విడుదలైన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది.

7224 New Covid-19 Cases Reported in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News