Monday, May 6, 2024

వ్యాన్-బస్సు ఢీ: 8 మంది మృతి

- Advertisement -
- Advertisement -

 

జైపూర్: రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌లో గురువారం ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చురు జిల్లా పరశ్నేను వద్ద జాతీయ రహదారి 11పై వ్యాన్, బస్సు ఢీకొని ఎనిమిది మంది ఘటనా స్థలంలోనే మృతి చెందారు. వాహనదారుల సమాచారం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతులంతా బికనేర్ ప్రాంతానికి చెందిన వారని రాజల్‌దశర్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ సురేంద్ర రాణా తెలిపాడు. ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా రోడ్డుపై ఉన్న వాహనాలను క్రేన్ సహాయంతో తొలగించారు.

8 killed in van-bus collision in Churu in Rajasthan, Case registered on Accident and deceased were natives of Bikane says by police officer surendra rana

 

8 killed in van-bus collision in Churu in Rajasthan
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News