Friday, April 26, 2024

వేటగాళ్ల విషప్రయోగం: ఎనిమిది నెమళ్లు మృతి

- Advertisement -
- Advertisement -

peacocks

మంచిర్యాల: వేటగాళ్ల విష ప్రయోగాలకు మూగజీవాలు కనుమరుగవుతున్నాయి. మంచిర్యాల జిల్లాలో నన్పూర్‌ మండలం శ్రీరాంపూర్ అటవీప్రాతంలో వేటగాళ్ల విషప్రయోగంతో ఎనిమిది నెమళ్లు చనిపోయాయి. నెమళ్ల మృతి ఘటనపై అటవీశాఖ అధికారులు విచారణ చేపట్టారు. అడవిలో నీళ్లు తాగడానికి వెళ్లిన నెమళ్లకు వేటగాళ్లు విషం కలిపిన వడ్ల గింజలు వేసినట్టు అటవీశాఖ అధికారుల విచారణలో వెల్లడైంది. నెమళ్ల మృతికి సంబంధించింది అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

8 Peacocks found dead in Mancherial district

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News