మనతెలంగాణ/ హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం నూతన పాలకమండలిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఆలయ పాలక మండలికి 25 మంది సభ్యుల జాబితాతో పలు రాష్ట్రాలకు చెందిన వారికి చోటు దక్కింది. టిటిడి చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి కొనసాగుతున్నారు. పాలకమండలి బోర్డు సభ్యులుగా తెలంగాణ రాష్ట్రం నుంచి ఎనిమిది మందికి చోటు దక్కింది. వారిలో కల్వకుంట్ల విద్యాసాగర్రావు, మూరంశెట్టి రాములు, నందకుమార్, జూపల్లి రామేశ్వర్రావు, రాజేష్శర్మ, పార్థసారథిరెడ్డి, జీవన్రెడ్డి, లక్ష్మీనారాయణ వేమిరెడ్డి ప్రశాంత్రెడ్డి, శశిధర్, పోలకల ఆశోక్, మల్లాడి కృష్ణారావు, శంకర్,విశ్వనాథ్రెడ్డి, ముగ్గురు ఎమ్మెల్యేలకు చోటు దక్కింది. మధుసూధన్యాదవ్ (కనిగిరి), బాబురావు (పాయకరావుపేట), కాటసాని రాంభూపాల్రెడ్డి (రాయలసీమ), కర్ణాటక నుంచి శశిధర్, శంకర్, డాక్టర్ కేతన్ దేశాయ్కి లభించింది. వీరిలోని పలువురికి రెండోసారి టిటిడి సభ్యులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవకాశం కల్పించింది.