Friday, April 26, 2024

ఎపిలో కొత్తగా 8,218 కేసులు..

- Advertisement -
- Advertisement -

ఎపిలో కొత్తగా 8,218 కేసులు..

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. దీంతో రాష్ట్రంలో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 74,595మందికి పరీక్షలు చేయగా.. కొత్తగా 8,218 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. కరోనాతో మరో 58మంది బాధితులు మృతి చెందినట్లు తెలిపింది. దీంతో ఎపిలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 6,17,776కు చేరుకుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బారిన పడి 5,302మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 81,763మంది కరోనా బాధితులు రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో మొత్తం 5,30,711మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఎపిలో ఇప్పటివరకు 50,33,676మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది.

8218 New Corona Cases Registered in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News