- Advertisement -
ఎపిలో కొత్తగా 9,742 కరోనా కేేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో మరో 86మంది కరోనా బాధితులు మృతి చెందినట్లు తెలిపింది. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 3 లక్షల 16 వేల మూడుకు చేరుకుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో మొత్తం 2,906కి చేరింది. ప్రస్తుతం ఎపిలోని వివిధ ఆస్పత్రుల్లో 86,725మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇక, కరోనా బారి నుంచి ఇప్పటివరకు 26 వేల 372మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో ఎపిలో 57,685 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 30 లక్షలకు పైగా కరోనా పరీక్షలు చేశామని పేర్కొంది.
9742 New Corona Cases Registered in AP
- Advertisement -