- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గుతున్నాయి. గడిచిన 24గంటల్లో 1,21,236 మందికి పరీక్షలు నిర్వహించగా, 987 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అదే సమయంలో ఏడు మరణాలు సంభవించాయి. తాజాగా మరో 1,362 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకుని ఇళ్లకు డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 13,487 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 97.24శాతానికి చేరిందని వైద్య ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది.
987 New covid-19 cases reported in telangana
- Advertisement -