- Advertisement -
అమరావతి: భూ స్కామ్ కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రులు ప్రతిపాటి పుల్లారావు, పి నారాయణపై ఎపి సిఐడి గురువారం కేసు నమోదు చేసింది. తుళ్లూరు మండంలోని వెంకటపాలెం గ్రామానికి చెందిన బెల్లంకొండ నరసింహా రావు బినామీ ద్వారా రాజధాని ప్రాంతంలో దళిత మహిళల నుంచి మాజీ మంత్రులతోపాటు కొందరు టిడిపి సీనియర్ నాయకులు బలవంతంగా భూములు కొనుగోలు చేశారని పొత్తిరాజు బుజ్జి, పివి సునిల్ కుమార్, ఆదిలు ఫిర్యాదు చేయడంతో సిఐడి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీంతో ఇద్దరు మాజీ మంత్రులపై నేరపూరిత కుట్ర, మోసం, ఎస్సి, ఎస్టి అట్రాసిటీ తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
CID Lodges FIR on AP Ex Ministers Pulla Rao and Narayana
- Advertisement -