Monday, April 29, 2024

చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ – విచారణ వాయిదా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ :ఎపి స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు బెయిల్ ఇవ్వడాన్ని రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. సుప్రీంకోర్టులో సోమవారం ఈ పిటిషన్‌పై విచారణ జరగగా ధర్మాసనం రెండు వారాలకు వాయిదా వేసింది. చంద్రబాబుకు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలంటూ ఎపి సిఐడి సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ వేసింది. దీని తదుపరి విచారణను ఫిబ్రవరి 26వ తేదీకి వాయిదా వేశారు. విచారణలో భాగంగా న్యాయవాది హరీశ్ సాల్వే కొన్ని ఇబ్బందుల వల్ల సోమవారం కోర్టుకు రాలేక పోయారని మరో న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వివరించారు. అందుకే ఈ కేసును మూడు వారాలపాటు వాయిదా వేయాలని కోరారు. అయితే, ఎపి ప్రభుత్వం, సిఐడి తరపు న్యాయవాది రంజిత్ కుమార్ మాట్లాడుతూ వీలయినంత త్వరగా డేట్ ఇవ్వాలని కోరారు.

ఇరువర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ఈ కేసును రెండు వారాల పాటు వాయిదా వేసింది. అందులో భాగంగా ఫిబ్రవరి 26వ తేదీన కేసు విచారణ ఉంటుం దని ధర్మాసనం స్పష్టం చేసింది. జస్టిస్ బేలా ఎం. త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం ఈ నెల 26వ తేదీన కేసు విచారణ చేపట్టనుంది. ఎపి స్కిల్ కేసులో చంద్రబాబుకు ఎపి హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో ఎపి సిఐడి స్పెషల్ లీవ్ పిటిషన్ ను గతేడాది వేసింది. స్కిల్ కేసులో చంద్రబాబు గతేడాది సెప్టెంబరులో అరెస్టు కాగా, ఎపి హైకోర్టు నవంబరులో బెయిల్ మంజూరు చేసిన సంగతి విదితమే. తొలుత తాత్కాలిక బెయిల్ ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్‌ను ఎపి హైకోర్టు మంజూరు చేసింది. ఎపి హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను సవాలు చేస్తూ ఎపి సిఐడి సుప్రీంకోర్టుకు వెళ్లింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News