‘ఛలో’ మూవీతో రష్మికను ఇండస్ట్రీకి పరిచయం చేసి మంచి హిట్ను అందుకున్నాడు దర్శకుడు వెంకీ కుడుముల. తన మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ అందుకున్నాడు. ఆతర్వాత తన రెండో సినిమా ‘భీష్మ’లో కూడా రష్మికను హీరోయిన్గా తీసుకొని మరో హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక రష్మికను ఇండస్ట్రీకి పరిచయం చేసింది వెంకీ అయితే ఆమె క్రేజీ హీరోయిన్గా మారేందుకు కారణమయ్యాడు డైరెక్టర్ పరశురాం. ‘గీత గోవిందం’ సినిమాతో రష్మిక క్రేజీ స్టార్లా మారిపోయేలా చేశాడు ఈ డైరెక్టర్. అయితే ఆ సినిమా తర్వాత పరశురాం ఇంతవరకు మరో సినిమా చేయలేదు. అయితే అతను ఇప్పుడు అక్కినేని హీరో నాగచైతన్యతో ఓ క్యూట్ లవ్ స్టోరీ మూవీకి రంగం సిద్ధం చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్లో రష్మికను హీరోయిన్గా తీసుకోవాలనుకుంటున్నాడట. ప్రస్తుతం ‘భీష్మ’ సక్సెస్ని ఎంజాయ్ చేస్తూ మరోవైపు అల్లు అర్జున్ సినిమా షూటింగ్లో చేరేందుకు సిద్ధమవుతోంది రష్మిక.