- Advertisement -
హైదారబాద్: మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19)ను అరికట్టేందుకు చేస్తున్న పోరాటంలో ఎంతోమంది ప్రముఖులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తమ వంతుగా సహాయం చేస్తూ అండగా నిలుస్తున్నారు. ఇక తెలంగాణలోనూ సినీ, వ్యాపార, క్రీడా ప్రముఖలు, ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి సహాయనిధికి భారీగా విరాళాలు అందజేస్తున్నారు. తాజాగా హీరో రాజశేఖర్ కూతుర్లు శివాని, శివాత్మికలు ప్రకటించినట్టుగానే తమ వంతు సహాయంగా చెరో లక్ష రూపాయల చెక్కును మంత్రి కెటిఆర్ ను కలిసి అందజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందించడంతోపాటు ఇండస్ట్రీలోని పేద సినీ కార్మికుల కోసం సిసిసి ద్వారా ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోలు, దర్శకులు, నిర్మాతలు, పలువురు హీరోయిన్లు విరాళాలు అందజేసిన సంగతి తెలిసిందే.
Rajashekar’s Daughters Donates to Telangana CMRF
- Advertisement -