నియంత్రిత పంటలకు జిల్లాలవారీ వ్యవసాయ కార్డులు
అమలు బాధ్యత కలెక్టర్లకు
సిద్ధమైన పంటల పటం
ఆమోదించిన సిఎం?
వరి విస్తీర్ణంలో 95వేల ఎకరాలు మైనస్!
పత్తి 10లక్షల ఎకరాలు అధికం!
అన్ని జిల్లాల్లోనూ పెరగనున్న కంది సాగు
మన తెలంగాణ/హైదరాబాద్ : నియంత్రిత పంటల సాగు బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు అప్పగించించింది. ఏ జిల్లాలో ఏ పంట ఎంత మొత్తం విస్తీర్ణంలో సాగు అవ్వాలనే దానిపై ప్రభుత్వం పంట ప్రణాళికను జిల్లా వ్యవసాయ కా ర్డు ల (డిస్ట్రిక్ అగ్రికల్చర్ కార్డ్)రూపంలో అం దిస్తుంది. దీనిని కలెక్టర్లు వారి సంబంధిత జిల్లాల్లో అమలు చేయాల్సి ఉంటుంది. ఈ వానకాలం సాగులో ప్రభుత్వం చెప్పిన ప్ర కారం కాకుండా వేరే ఇష్టారీతిన సాగు చే స్తే రైతుబంధును కట్ చేయనున్నారు. ఇప్పటికే ప్రాథమికంగా పంటల మ్యాపింగ్ను వ్యవసాయ శాఖ పూర్తి చేసింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుకు సోమవారం దీ నిని ప్రతిపాదించగా ఓకే చెప్పినట్లు కూ డా తెలిసింది. దీని ప్రకారం రాష్ట్రంలో ప్ర ధానంగా పత్తి, కందులు, వరి పంట సాగు ను ప్రోత్సాహించనున్నారు. ఈ వానకాలం సీజన్లోనే ఏ జిల్లాలో ఏ పంట ఎంత విస్తీర్ణంలో వేయాలనే దానిపై లెక్కలు కూడా తీ శారు. వీటిని త్వరలోనే జిల్లా కలెక్టర్లకు పం పనున్నారు.
అందులో భాగంగానే పంటల వారీగా విత్తనాల అమ్మకం తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లు తెలిసింది. మంగళవా రం రైతులు వరి విత్తనాలు తీసుకునేందుకు వెళితే రెండు రోజులు ఆగి రావాలని విక్రయదారులు సూచించారని యదాద్రి భువనగిరి జిల్లా రైతు ఒకరు మన తెలంగాణతో వ్యాఖ్యానించారు. రాష్ట్రవ్యాప్తంగా వరిసాగు విస్తీర్ణం 40.24 లక్షల ఎకరాల్లో , పత్తి 64.75 లక్షల ఎకరాల్లో, కందులు 14.09 లక్షల ఎకరాల్లో సాగు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. గత వానకాలం సీజన్లో సాగైన వరి విస్తీర్ణం 41.19 లక్షల ఎకరాలు ఉండగా దానిని 40.02 లక్షల ఎకరాలకు పరిమితం చేశారు. అంటే 95 వేల ఎకరాలను తగ్గిస్తున్నారు. ఇందులో అత్యధికంగా మూడు జిల్లాల్లో సాగు మూడు లక్షల ఎకరాల చొప్పున ఉంది. నల్లగొండలో 3.30 లక్షల ఎకరాలు, సూర్యాపేటలో 3.20 లక్షల ఎకరాలు, నిజామాబాద్లో 3 లక్షల ఎకరాల్లో వేశారు. జగిత్యాల్, కామారెడ్డి, కరీంనగర్, మహబూబ్నగర్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సూర్యాపేట, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ జిల్లాలు మినహా మిగా అన్ని జిల్లాల్లోనూ వరిసాగును తగ్గించాలని నిర్ణయించారు.
పత్తి 10 లక్షల ఎకరాల అధికం
గత ఏడాది వానకాలం సాగు కంటే ఈసారి పత్తి సాగును ప్రభుత్వం 10.24 లక్షల ఎకరాల్లో అధికంగా సాగు చేయించాలని భావిస్తోంది. ఈ మేరకు జిల్లాల వారీగా పంటల మ్యాపింగ్ పూర్తి చేసింది. గత సంవత్సరం 54.45 లక్షల ఎకరాల్లో సాగైనట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈసారి ఆ మొత్తం విస్తీర్ణాన్ని 64.75 లక్షల ఎకరాలకు పెంచుతూ జిల్లాల వారీగా మ్యాపింగ్ చేశారు. మెదక్, నారాయణ్పేట్, యదాద్రి భువనగిరి జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాల్లోనూ పత్తి సాగును పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రధానంగా మూడు జిల్లాల్లో అత్యధికంగా పత్తి పంటను సాగు చేస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. నల్లగొండ జిల్లాలో 7.25 లక్షల ఎకరాల్లో, నాగర్కర్నూల్ జిల్లాలో 4.50 లక్షల ఎకరాలు, ఆదిలాబాద్లో 4.35 లక్షల ఎకరాల్లో పత్తి సాగు మ్యాపింగ్ చేశారు.
తెలంగాణ పప్పు
ఈసారి ప్రభుత్వం కంది పప్పు సాగును విపరీతంగా ప్రోత్సాహించాలని పంటల మ్యాపింగ్లో నిర్ణయించింది. ఎంత కంది వస్తే అంత మొత్తం మద్ధతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని కూడా సిఎం కెసిఆర్ సోమవారం ప్రకటించారు. గత ఏడాది వానకాలం సాగుతో పోలిస్తే దాదాపు అన్ని జిల్లాల్లో కంది పంట సాగును పెంచనున్నారు. గత వానకాలంలో 7.38 లక్షల ఎకరాల్లో కందులు సాగు కాగా ఈసారి అదనంగా 6.70 లక్షల ఎకరాలతో 14.09 లక్షల ఎకరాల్లో మ్యాపింగ్ను సిద్ధం చేశారు. ఇందులో అత్యధికంగా వికారాబాద్లో 1.73 లక్షల ఎకరాలు, నారాయణ్పేట్లో 1.70 లక్షల ఎకరాలు, రంగారెడ్డిలో లక్ష ఎకరాల్లో సాగు ప్రతిపాదించారు.
సోయాబీన్ సాగు తగ్గింపు
సోయాబీన్ సాగును ఈ వానకాలంలో తగ్గించాలని పంటల మ్యాపింగ్ పేర్కొన్నారు. దీనిప్రకారం గతేడాది 4.26 లక్షల ఎకరాల్లో సాగు నమోదు కాగా, ఈసారి 2.46 లక్షల ఎకరాల్లో వేసేలా ప్లాన్ చేశారు. 1.74 లక్షల ఎకరాలను తగ్గించాలని ప్రతిపాదించారు. ప్రధానంగా నిర్మల్లో 60 వేల ఎకరాల్లో, కామారెడ్డిలో 50 వేల ఎకరాలు, సంగారెడ్డిలో 46 వేల ఎకరాల్లో సాగు మ్యాపింగ్ చేశారు.
జొన్న, మినుములు, ఆముదం పెంపు
జొన్నలు, మినుములు, ఆముదం సాగు పెంపును మ్యాపింగ్లో ప్రస్తావించారు. ఈ వానకాలంలో జొన్నలు 1.42 లక్షల ఎకరాలు, మినుములు 65,980 ఎకరాలు, ఆముదం 1.39 లక్షల ఎకరాల్లో సాగు చేసేలా ప్రతిపాదించారు. ఇక చెరకు సాగును కూడా పెంచాలని ప్రణాళికలో పేర్కొన్నారు. ఈసారి 69,855 ఎకరాల్లో వేసేలా ప్లాన్ చేశారు. వేరుశనగ 49,960 ఎకరాల్లో సాగు మ్యాపింగ్ చేశారు.
జిల్లాల వారీగా ప్రధాన పంటల
ప్రతిపాదిత వానాకాలం సాగు మ్యాపింగ్ ఎకరాల్లో
జిల్లా వరి పత్తి కందులు
ఆదిలాబాద్ 1293 4,35,088 85,742
భద్రాద్రి కొత్తగూడెం 1,25,000 1,85,000 13,500
జగిత్యాల 2,52,000 70,000 25,000
జనగాం 80,000 2,01,000 2500
జయశంకర్ 73,067 1,65,000 80,000
జోగులాంబ గద్వాల 45,000 2,00,000 50,000
కామారెడ్డి 2,50,000 1,40,000 3050
కరీంనగర్ 2,22,000 1,00,979 10,000
ఖమ్మం 2,30,000 3,35,000 35,000
కొమురం భీం 55,000 3,40,550 15,000
మహబూబాబాద్ 1,20,000 1,65,000 65,000
మహబూబ్నగర్ 50,000 1,15,000 7000
మంచిర్యాల 1,45,000 2,20,000 30,000
మెదక్ 1,35,000 70,000 2100
మేడ్చల్ మల్కాజ్గిరి 10,000 1000 5000
ములుగు 93,000 50,000 45,000
నాగర్కర్నూల్ 45,000 4,50,000 30,000
నల్లగొండ 3,30,000 7,25,000 3500
నారాయణ్పేట 85,000 1,50,000 5000
నిర్మల్ 90,000 2,35,000 1,00,000
నిజామాబాద్ 3,00,000 1,42,000 75,000
పెద్దపల్లి 1,70,000 1,10,000 70,120
రాజన్న సిరిసిల్ల 1,10,000 1,40,000 50,000
రంగారెడ్డి 39,000 2,60,000 1,00,000
సంగారెడ్డి 43,500 4,20,000 75,000
సిద్ధిపేట 1,50,368 2,70,401 70,120
సూర్యాపేట 3,20,000 1,83,000 50,000
వికారాబాద్ 30,000 2,52,000 1,73,900
వనపర్తి 1,25,000 20,000 50,000
వరంగల్ రూరల్ 1,15,000 1,85,000 6000
వరంగల్ అర్బన్ 75,000 85,000 5000
యదాద్రి భువనగిరి 1,10,000 50,000 1,00,000