- Advertisement -
హైదరాబాద్: తన తల్లికి కరోనా వచ్చిందని చికిత్స చేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు ఓ నటి విన్నవించుకుంది. బుల్లి తెర నటి దీపికా సింగ్ తల్లిదండ్రులు ఢిల్లీలో ఉంటున్నారు. ఆమె తల్లికి కరోనా పాజిటివ్ రావడంతో చికిత్స చేయాలని సిఎం కేజ్రీవాల్, ప్రధాని నరేంద్ర మోడీని తన ఇన్స్టాగ్రామ్లో కోరింది. ప్రస్తుతం తన తల్లి ఉంటున్న ఇంట్లో 45 మంది ఉంటున్నారని పేర్కొంది. లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజీలో తన తల్లికి పరీక్షలు జరిపారని, కరోనా పాజిటివ్ వచ్చిందని వైద్యులు తెలిపారని, కానీ రిపోర్ట్ ఇవ్వలేదని చెప్పారు. తన తల్లి వయసు 55 సంవత్సరాలు ఉంటుందని, వైరస్ ఎలా సోకిందో అర్థం కావడం లేదని వివరించింది. ఇంట్లో ఉన్న అందరికి పరీక్షలు చేసి రక్షించాలని వేడుకోంది.
- Advertisement -