Thursday, May 16, 2024

సైనికుల ధైర్యసాహాసాలకు దేశం గ‌ర్విస్తుంది: రాజ్‌నాథ్ సింగ్‌

- Advertisement -
- Advertisement -

హైద‌రాబాద్‌: గాల్వ‌న్ వ్యాలీలో సైనికులు చనిపోవడం క‌లిచివేస్తుందని ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్విట్ట‌ర్ ద్వారా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. స‌రిహ‌ద్దు విధుల్లో మ‌న సైనికులు అత్యంత ధైర్య‌సాహాసాలు ప్ర‌ద‌ర్శించారని.. వారి త్యాగాల‌ను, ధైర్యాన్ని దేశం ఎప్పటికీ మ‌రిచిపోదని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఈ ఘటనలో వీరమరణం పొందిన సైనికుల కుటుంబాల‌కు ఆయన సానుభూతి తెలిపారు. దేశం మొత్తం వారికి అండగా ఉంటుందని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. దేశం కోసం పోరాడి అమరులైన వీర సైనికుల ధైర్యసాహాసాలకు దేశం గ‌ర్విస్తుందన్నారు. సోమవారం రాత్రి గాల్వ‌న్ వ్యాలీలోని భారత్-చైనా సరిహద్దులో జరిగిన ఘర్షణలో 20 మందికి పైగా భారత జవాన్లు ప్రాణాలు కోల్పోగా.. దాదాపు 43 మంది చైనా సైనికులు మృతి చెందినట్లు తెలుస్తోంది.

Loss of Soldiers in Galwan is painful says Rajnath Singh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News