లక్నో: ఉత్తర్ ప్రదేశ్ లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ పెళ్లి వేడుకలో స్వీట్ల కోసం గొడవపడిన వరుడు తన బామ్మర్దిని చంపిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివారాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్లోని శంషాబాద్ ప్రాంతంలో సోమవారం రాత్రి జరిగిన ఓ పెళ్లి వేడుకలో మద్యం మత్తులో ఉన్న వరుడు మనోజ్ కుమార్, అతని స్నేహితులు స్వీట్ల విషయంలో పెళ్లి కుమార్తె బంధువులతో గొడవకు దిగారు. స్వీట్లు తమకు ఇవ్వడంలేదని బూతులు తిడుతూ రెచ్చిపోయారు.
అనంతరం కారులో అక్కడి నుంచి పారిపోతూ.. కారును జనంపైకి పోనిచ్చారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు, ఓ బాలిక తీవ్రంగా గాయపడ్డారు. అక్కడితో ఆగకుండా.. పెళ్లి కూతురు తమ్ముడిని తీసుకెళ్లి గొంతు నులిమి చంపేసిన వరుడు, అతని స్నేహితులు.. మంగళవారం ఉదయం మృతదేహాన్ని గ్రామంలోనే వదిలి పారిపోయారు. దీంతో కన్నీరు మున్నీరైన వధువు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వరుడు మనోజ్ కుమార్, అతని స్నేహితుల కోసం గాలిస్తున్నారు.
Groom kills brother-in-law at Wedding in UP