లక్నో: ఆరుగురు అన్నదమ్ములకు పెళ్లి కావటంలేదని దేవత ముందు వృద్ధుడి మొండెం నుంచి తలను వేరు చేసి బలిచ్చిన సంఘటన ఉత్తర ప్రదేశ్లోని గోండ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఉదయ్ ప్రకాశ్ శుక్లా అనే వ్యక్తి (25)తో అతడి ఐదుగురు అన్నదమ్ములకు పెళ్లిలు జరగటం లేదు. పెళ్లి సంబంధాలు వస్తున్నాయి కాని ఎవరు వారిని పెళ్లి చేసుకోవడం లేదు. తమ కుటుంబంలో అన్నదమ్ములకు పెళ్లిలు కావడం లేదని పూజారి కలిశాడు. దేవతకు ఓ వృద్ధుడిని బలి ఇస్తే పెళ్లిలు జరుగుతాయని పూజారి తెలిపాడు. వాళ్ల ఇంటికి సమీపంలో బాబురామ్ (60) అనే వృద్ధుడు వుండేవాడు. ఉదయ్ పదునైన ఆయుధంతో వృద్ధుడి మెడను నరికి మొండెం నుంచి తలను వేరు చేశాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడి చేరుకొని నిందితుడిని పట్టుకున్నారు. పూజారి మాటలు విని పెళ్లిల కోసమే హత్య చేశానని నిందితుడు ఒప్పుకోవడంతో అతడిని అరెస్టు చేశామని పోలీస్ అధికారి రాజ్నాథ్ సింగ్ తెలిపాడు.