అమరావతి: కడప జిల్లా ప్రొద్దుటూరులో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని మనస్తాపం చెందిన ఇద్దరు కుమార్తెలు బలవన్మరణానికి పాల్పడ్డారు. మయమ్మార్ కాలనీకి చెందిన బాబురెడ్డితో పెద్దమ్మాయికి వివాహం జరిగింది. చిన్న కుతూరు ఇంజనీరింగ్ చదువుతోంది. పెద్దమ్మాయి భర్త నుంచి వేధింపులు ఎదుర్కొంటున్న కారణంగా బాబురెడ్డి మనస్తాపానికి లోనయ్యాడు.
పెద్ద అల్లుడి వేధింపులతోనే తాను చనిపోతున్నానని చెబుతూ, సెల్ఫీ వీడియో తీసి శుక్రవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకున్నాడు. తండ్రి మరణంతో తీవ్ర విషాదంలో మునిగిపోయిన బాబురెడ్డి ఇద్దరు కుమార్తెలు ఈ శనివారం తెల్లవారుజామున రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. తండ్రి, కుమార్తెలు ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికంగా విషాద ఛాయాలు అలుముకున్నాయి.