Wednesday, May 8, 2024

భవనం పైకప్పు కూలి ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

Three dead four injured after roof of building collapses

పంజాబ్: దేశంలో కురుస్తున్న వర్షాలు కొందరి కుటుంబాల్లో విషాదాలను నింపుతున్నాయి. తాజాగా అమృత్ సర్ లో భవనం పైకప్పు కూలింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. గురువారం రాత్రి గురునానక్ పురా ప్రాంతంలో భారీ వర్షం పడింది. దీంతో భవనం పైకప్పు కూలిందని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News