- Advertisement -
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణం కేసులో ఢిల్లీ ప్రత్యేక కోర్టు మంగళవారం తీర్పు వెల్లడించింది. 1999 జార్ఖండ్లోని గిరిదిహ్లోని బ్రహ్మాదిహ బొగ్గు బ్లాక్ను కేటాయించడంలో జరిగిన అవకతవకలకు సంబంధించిన బొగ్గు కుంభకోణం కేసులో కేంద్ర మాజీ మంత్రి దిలీప్ రాయ్ ను ఢిల్లీ ప్రత్యేక కోర్టు దోషిగా తేల్చింది. దిలీప్ రాయ్, వాజ్ పేయీ హయంలో ఉక్కు, బొగ్గుశాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో బొగ్గు మంత్రిత్వ శాఖకు చెందిన ఇద్దరు సీనియర్ అధికారులను ప్రదీప్ కుమార్ బెనర్జీ, నిత్య నంద్ గౌతమ్, కాస్ట్రాన్ టెక్నాలజీస్ లిమిటెడ్ (సిటిఎల్), దాని డైరెక్టర్ మహేంద్ర కుమార్ అగర్వాల్లా, కాస్ట్రాన్ మైనింగ్ లిమిటెడ్ (సిఎమ్ఎల్)లను కూడా కోర్టు దోషులుగా నిర్ధారించింది.
Former Minister Dilip Ray Convicted In Coal Scam Case
- Advertisement -