వెస్ట్ బెంగాల్: కోల్కతాలో బిజెపి కార్యకర్తలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. కార్యకర్తల ఆందోళనలతో గురువారం టెన్షన్ వాతావరణం నెలకొంది. కార్యకర్త హత్యను నిరసిస్తూ చలో ‘నబన్నా’ పేరుతో బిజెపి సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చింది. మద్దతుగా పార్టీ శ్రేణులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. బారిగేట్లు దాటి సెక్రటేరియట్ ముట్టడికి యత్నించారు. పరిస్థితిని అదుపుచేసేందుకు పోలీసులు బిజెపి కార్యకర్తలపై లాఠీచార్జ్ చేశారు. వాటర్ కెనాల్ ప్రయోగించారు. అక్టోబర్ 4వ తేదీన బిజెపి కౌన్సెలర్ మనీష్ శుక్లా హత్య జరిగిన సంగతి తెలిసిందే.
#WATCH West Bengal: Police use water cannon & lathi-charge to disperse Bharatiya Janata Party (BJP) workers who are protesting at Howrah Bridge.
BJP has launched a state-wide 'Nabanna Chalo' agitation march today to protest against the alleged killing of its party workers. pic.twitter.com/dpPoqT8DlG
— ANI (@ANI) October 8, 2020