Thursday, May 16, 2024

అభివృద్ధికే పట్టం.. సంక్షేమానికే ఓటు

- Advertisement -
- Advertisement -

Minister Harish Speech At Dubbaka By Election Campaign

సిద్దిపేట: బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ఎన్ని మాటలు చేప్పినా.. అభివృద్ధికే పట్టం కడతామని.. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న టిఆర్‌ఎస్ పార్టీకే ఓటు వేస్తామని ప్రజలు స్పష్టం చేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. గురువారం సిద్దిపేట పట్టణంలోని మంత్రి నివాసంలో తొగుట మండలంలోని తుక్కాపూర్, ఘనపూర్ దౌల్తాబాద్ మండలంలోని శేరుపల్లి, బందారం, నర్సంపేటతో పాటు పలు గ్రామాల కాంగ్రెస్, బిజెపి నాయకులు మంత్రి హరీశ్‌రావు సమక్షంలో టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి మాట్లాడారు. 60 ఏళ్లలో జరగని అభివృద్ధి టిఆర్‌ఎస్ హయాంలో ఆరేళ్లలో జరిగిందని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న అసత్యపు ప్రచారాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు. సిఎం కెసిఆర్ మీద నమ్మకంతో టిఆర్‌ఎస్ పార్టీకి అపూర్వ స్పందన ఉందని అన్నారు. రాబోయే రోజుల్లో తొగుట మండలం మల్లన్న సాగర్ ప్రాజెక్టుతో సస్యశ్యామలం కాబోతుందని తెలిపారు. ప్రాజెక్టులు కడుతున్నం అంటే అడ్డుకున్నవారు. ఇప్పుడు ఓట్లు అడిగేందుకు వస్తున్నారని అన్నారు.

సొంత గూటికి టిఆర్‌ఎస్‌వి నేత

టిఆర్‌ఎస్‌వి రాష్ట్ర నాయకులు ఉద్యమకారుడు వేములఘాట్ గ్రామానికి చెందిన అమరేందర్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరగా గురువారం మంత్రి హరీశ్‌రావు సమక్షంలో తిరిగి టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ మేరకు మంత్రి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News