- Advertisement -
యాదాద్రి భువనగిరి: హైనా దాడిలో 20 గొర్రెలు మృతి చెందిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎనగంటి తండాలో జరిగింది. గ్రామ శివారులో ఉన్న గొర్రెల మందలోకి హైనా ప్రవేశించి 20 గొర్రెలను చంపేసింది. యజమాని గొర్రెల దొడ్డి దగ్గర వచ్చే చూసేసరికి 20 గొర్రెలు చనిపోయి ఉన్నాయి. భారీ ఆస్తి నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు. తండా శివారులో హైనా సంచరిస్తుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైనాను పట్టుకోవాలని పలు గ్రామాల ప్రజలు అటవీ శాఖ అధికారులకు కోరుతున్నారు.
- Advertisement -