- Advertisement -
అడిలైడ్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి డేనైట్ టెస్ట్లో భారత బ్యాట్స్మెన్లు తడబడ్డారు. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న నాలుగు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో తొలిరోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి కోహ్లి సేన 6 వికెట్లకు 233 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో ఓపెనర్లుగా వచ్చిన పృథ్వి షా (0), ఇన్నింగ్స్ రెండో బంతికే పృథ్వి షా డకౌటయ్యాడు. మయాంక్ అగర్వాల్ (17) విఫలమయ్యారు. విరాట్ కోహ్లి (74), పుజారా (43), రహానే(42)పరుగులు చేశారు. అశ్విన్ 15, సాహా 9 పరుగులతో ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. అటు బౌలింగ్ లో స్టార్క్ 2 వికెట్లు, హేజిల్ వుడ్, కమ్మిన్స్, లియోన్ కు తలో వికెట్ దక్కింది.
- Advertisement -