గాలే: శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ 2-0తో సిరీస్ను క్లీన్స్వీప్ చేసింది. శ్రీలంక ఉంచిన 164 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ అలవోకగా ఛేదించింది. ఒక దశలో 89 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను ఓపెనర్ డొమినికి సిబ్లి 56(నాటౌట్), వికెట్ కీపర్ జోస్ బట్లర్ 46 (నాటౌట్) ఆదుకున్నారు. ఇద్దరు శ్రీలంక బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు నడిపించారు. సమన్వయంతో ఆడిన వీరు మరో వికెట్ పడకుండానే జట్టును గెలిపించారు. అంతకుముందు శ్రీలంక రెండో ఇన్నింగ్స్లో 126 పరుగులకే కుప్పకూలింది.
ఇంగ్లండ్ స్పిన్నర్లు డామ్ బెస్, జాక్లీచ్ నాలుగేసి వికెట్లు పడగొట్టి లంక ఇన్నింగ్స్ను కుప్పకూల్చారు. లంక జట్టులో ఎంబుల్డెనియా(40) ఒక్కడే కాస్త రాణించాడు. ఇక తొలి ఇన్నింగ్స్లో లంక 381 పరుగులు చేసింది. ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్లో 344 పరుగులకు ఆలౌటైంది. ఇక ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ మ్యాన్ ఆఫ్ది మ్యాచ్తో పాటు ప్లేయర్ ఆఫ్ది సిరీస్ అవార్డును సొంతం చేసుకున్నాడు.
England win 2nd Test against Sri Lanka