పలుమార్లు అబార్షన్లు చేయించిన నిందితుడు
గర్భసంచికి ముప్పు రావడంతో తీసివేయించిన యువకుడు
విషయం తెలిసి బంధువుల ఆందోళన
హైదరాబాద్: ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని యువతి వెంటపడిన ఓ యువకుడు పలుమార్లు ఆమెకు అబార్షన్ చేయించాడు. చివరికి గర్భసంచికి ముప్పు రావడంతో ఎల్బి నగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో బాధితురాలికి గర్భసంచి తీసి వేయించాడు. నల్గొండ జిల్లా, కోదాడకు చెందిన భద్రం రాజు రాజేష్నాయుడు, నాగమణితో పరిచయం ఏర్పడింది. ప్రేమిస్తున్నానని వెంటపడడంతో యువతి అంగీకరించింది. ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడడంతో పలుమార్లు గర్భం దాల్చింది. నిందితుడు పలుమార్లు యువతికి అబార్షన్ చేయించడంతో గర్భసంచి పాడైపోయింది. దీంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి గర్భసంచిని తీసివేయించాడు. యువతి తల్లిదండ్రుల అనుమతి లేకుండా గర్భసంచి తొలగించడంతో ఆమె బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. యువకుడిని వెంటనే అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.