Monday, May 6, 2024

భార్య గొంతు కోసి…..

- Advertisement -
- Advertisement -

Husband cut wife throat in Asifabad

 

కుమ్రంభీం ఆసిఫాబాద్: తాగిన మైకంలో భర్త తన భార్య గొంతు కోసిన సంఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం ధనోరాబీ గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. తుకారామ్-రాధాబాయి అనే మహారాష్ట్రకు చెందిన దంపతులు ధనోరాబీ గ్రామంలో నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. తుకారామ్ మద్యం తాగి వచ్చి నిత్యం భార్యతో గొడవ పెట్టుకునేవాడు. మద్యం పూటుగా తాగి భార్యతో గొడవ పడ్డాడు. ఇద్దరు మధ్య ఘర్షణ తీవ్ర స్థాయికి చేరుకోవడంతో బ్లేడ్ తో రాధాబాయి గొంతు కోశాడు. గాయపడిన రాధాబాయిని జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News