మహారాష్ట్ర జలగావ్లో దారుణం
దర్యాప్తునకు ఆదేశించిన మహారాష్ట్ర హోంమంత్రి
ముంబై : మహారాష్ట్ర లోని జల్గావ్లో ప్రభుత్వ ఆశాదీప్ మహిళల వసతి గృహం విద్యార్థినులను నగ్నంగా కొందరు పోలీస్ అధికారులు డ్యాన్స్ చేయించిన సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్టు రాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ముఖ్ బుధవారం వెల్లడించారు. ఈమేరకు నలుగురు సభ్యులతో ఉన్నత స్థాయి కమిటీని నియమించినట్టు తెలిపారు. బుల్దానా, చిక్లి నియోజక వర్గం బిజెపి ఎంఎల్ఎ శ్వేతా మహాలే ఈ సంఘటన గురించి సభలో ప్రస్తావించడంతో ఈ దారుణం వెలుగు లోకి వచ్చింది. దీనిపై ఓ ఎన్జివొ ఈ సంఘటనను జిల్లా కలెక్టర్కు తెలియచేశారు.
ఈ నేపథ్యంలో ప్రతిపక్షసభ్యులు అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తడంతో మంత్రి నలుగురు సభ్యుల కమిటీతో దర్యాప్తు చేయిస్తున్నట్టు ప్రకటన చేశారు. ఈ విషయంపై ప్రభుత్వం సీరియస్గా ఉండడం లేదని బిజెపి నేత సుధీర్ ముంగన్ తివార్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. మీడియా కథనాల ప్రకారం వసతి గృహానికి బయటి నుంచి కొందరు పోలీసులతో వచ్చి దర్యాప్తు పేరుతో బెదిరించి కొంతమంది బాలికలను నగ్నంగా డ్యాన్సు చేయించారని బాలికలు ఫిర్యాదు చేశారు. ఈసంఘటన తాలూకు వీడియో కూడా ప్రసారమైంది. దీనిపై మంత్రి దేశ్ముఖ్ రెండు రోజుల్లో ఈ సంఘటనపై నివేదిక కోరామని, నివేదిక అందిన తరువాత చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు.