Thursday, May 16, 2024

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు కరోనా

- Advertisement -
- Advertisement -

Minister Errabelli Dayakar Rao Tested Corona Positive

హైదరాబాద్: రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కరోనా బారిన పడ్డారు. ఇటీవల వారం రోజుల పాటు రైతుల సమస్యలపై ఢిల్లీలో పర్యటించిన మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు శుక్రవారం రాత్రి తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ఈక్రమంలో కరోనా లక్షణాలు కనిపించడంతో శనివారం సాయంత్రం ఆయనకు యాంటీజెన్ రాపిడ్ పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో మంత్రి ఎర్రబెల్లి ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నారు. గత మూడు, నాలుగు రోజులుగా తనను కలిసిన వారు వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. తన ఐసోలేషన్ పూర్తయ్యే వరకు ప్రజలెవ్వరూ తన వద్దకు రావద్దని కోరారు.

తన నియోజకవర్గ ప్రజలకు అధికారులు, పిఎలు అందుబాటులో ఉంటారని సూచించారు. ప్రస్తుతం మంత్రి ఎర్రబెల్లి వైద్యులను సంప్రదించి తగు మందులు తీసుకుంటూ క్షేమంగా ఉన్నారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. కాగా ఢిల్లీ పర్యటనకు మంత్రి ఎర్రబెల్లితో పాటు మంత్రులు నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ సహా టిఆర్‌ఎస్ పార్లమెంట్ నేత కెకె, ఎపి నామా నాగేశ్వరరావుతో పాటు కొందరు కూడా ఉన్నారు. రాష్ట్ర రైతుల ప్రయోజనార్థమై, వారు పండించిన ధాన్యం, బియ్యం కేంద్రం కొనుగోలు చేయడంపై రాతపూర్వక హామీ కోసం గత నాలుగు, ఐదు రోజులుగా ఢిల్లీలో పడిగాపులు కాసిన నేపథ్యంలో తనకు కరోనా వచ్చిందని, ఇప్పటికైనా కేంద్రం రైతులకు స్పష్టమైన హామీ ఇవ్వాలని ఎర్రబెల్లి కోరారు. అయితే, గత మూడు, నాలుగు రోజులుగా తనను కలిసిన వాళ్ళు వెంటనే పరీక్షలు చేయించుకోవాలని, తగు జాగ్రత్తలు వహిస్తూ, వీలైనంత వరకు హోమ్ క్వారంటైన్‌లో సురక్షితంగా ఉండాలని మంత్రి కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News