Thursday, May 9, 2024

మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం

- Advertisement -
- Advertisement -

డ్రగ్స్ వినియోగించినా.. విక్రయించినా కఠిన చర్యలు
యాంటీ నార్కోటిక్ బ్యూరోకు పూర్తిస్థాయి డైరెక్టర్
గ్రేహౌండ్స్, ఆక్టోపస్ మాదిరిగా టిఎస్ నాబ్
సమీక్ష సమావేశంలో ఉన్నతాధికారులకు సిఎం ఆదేశాలు

మన తెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్రంలో మాదక ద్రవ్యాల చెలామణి,వినియోగంపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నార్కోటిక్స్ నియంత్రణ అంశంపై సచివాలయంలో సమీక్షా సమావేశం సోమవారం జరిగింది. ఈ సమీక్షా సమావేశానికి రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి జూప ల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డిజిపి రవి గుప్తా, ఇంటలీజెన్స్ విభాగం అడిషనల్ డిజి శివధర్ రెడ్డి, సిఎంఒ కార్యదర్శి శేషాద్రి, సంబంధిత శాఖల ఉన్నతాధి కారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సి.ఎం. మాట్లాడుతూ, రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు, వినియోగించినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న తెలంగాణా రాష్ట్ర యాంటీ నార్కోటిక్ బ్యూరోకు పూర్తి స్థాయి డైరెక్టర్‌ను నియమించడంతో పాటు ఆ విభాగం బలోపేతం చేయాలన్నారు. ఈ విభాగానికి కావాల్సిన నిధులు, వనరులు ఇతర సౌకర్యాలను సమకూర్చాలని ఆదేశించారు. మాదక ద్రవ్యాలను విక్రయించే, చెలామణి నిరోధానికి అత్యంత ప్రాధాన్యతనివ్వాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న గ్రే హాండ్స్, ఆక్టోపస్ మాదిరిగా టిఎస్‌నాబ్ ను తీర్చిదిద్దాలన్నారు. తెలంగాణా రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా రూపొందించాలని రేవంత్ స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ, ఔషధ నియంత్రణా మండలి, పోలీస్ శాఖకు చెందిన వివిధ విభాగాల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News